రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై శంకరాచార్యులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

ఇటీవల లోక్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జోత్యిమఠ్ 46 శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆయన సమర్ధించారు.రాష్ర్టపతి తీర్మానానికి ధన్యవాదం తెలిపే సమయంలో రాహుల్ గాంధీ..బీజేపీ మతంపేరుతో ప్రజలను చీల్చుతుందని ఆరోపణలు చేశారు. దీంతో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎదురుదాడికి దిగారు.

రాహుల్ గాందీ హిందూసమాజం మొత్తాన్ని హింసావాదులుగా చిత్రీకరిస్తున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. అంతేకాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర వివాదానికి దారితీసాయి .రికార్డులనుంచి వివాస్పద ప్రకటనలు తొలగించారు కూడా. హిందువులకు పూజ్యుడు అయిన శంకరాచార్య ఈ వివాదం పై భిన్నంగా స్పందించారు. రాహుల్ గాంధీ ప్రసంగం మొత్తం శ్రద్ధగా విన్నాం. .హిందూ మతం హింసను తిరస్కరిస్తుందని ఆయన నిర్ద్వంద్వంగా నొక్కి చెప్పారని శంకరాచార్య అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లా వైరల్ అవుతోంది. వాస్తవాలను వక్రీకరించే వారికి జవాబుదారీగా ఉండాలని కోరుతూ..Mr గాంధీ ప్రసంగాన్ని ఎంపిక చేసిన ప్రచారం అని అన్నారు.రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుదారి పట్టించేదిగా ఉంది.. ఇది అనైతికం. బాధ్యులను శిక్షించాలని శంకరాచార్య డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news