చంద్ర‌బాబుకు బిగ్ షాక్‌.. టీడీపీలో మ‌రో వికెట్ డౌన్‌..

-

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక తాజాగా టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్‌ను మద్దాలి గిరి కలిశారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమానికి ఆయన గైర్హాజరైనారు. గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రవి గెలుపొందారు.

అమరావతి నుంచి రాజధాని తరలించడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తోంది. ఇలాంటి పరిస్థితిల్లో గుంటూరు జిల్లాకు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడడం గమనార్హం. రవిని వైసీపీలో చేర్చుకోవడం వెనుక వైసీపీ నేతల వ్యూహం ఉందని పలువురు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news