అర్ధరాత్రి చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగులపై లాఠీచార్జ్‌

-

అర్ధరాత్రి చిక్కడపల్లి లైబ్రరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులపై లాఠీచార్జ్‌ జరిగింది. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద గ్రూప్ 2 అభ్యర్థులు అరెస్టు అయ్యారు. గ్రూప్ 2, 3 పోస్టులను పెంచాలని గ్రూప్-2 ను డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ లో ధర్నా చేశారు నిరుద్యోగ అభ్యర్థులు.

A tense atmosphere prevailed at the Chikkadapally library at midnight

ఈ తరుణంలోనే లైబ్రరీ నుంచి బయటకు వెళ్లేందుకు యత్నిం చారు అభ్యర్థులు. లైబ్రరీ గేటు కి లాక్ వేసి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో లైబ్రరీ లొనే ఆందోళన కొన సాగిస్తున్న అభ్యర్థులను అరెస్టు చేసారు పోలీసులు. ఇక అటు అర్దరాత్రి పోలీస్ స్టేషన్ లోనే మహిళా నిరుద్యోగులు ఉన్నారు. అరెస్ట్ చేసిన నిరుద్యోగులను బొల్లారం పోలీస్ స్టేషన్లో ఉంచారు పోలీసులు. ఈ సంఘటన పై హరీష్ రావు, కేటీఆర్ కూడా స్పందించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news