ఒలంపిక్స్ 2024 : విజయంతో ప్రారంభించిన గెలుపు గుర్రాలు..!

-

గత ఏడాది కాలంగా బ్యాడ్మింటన్ ప్రపంచంలో మారుమ్రోగి పోతున్న పేర్లు ఏమైనా ఉన్నాయా అంటే అవి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో ఈ ఇద్దరు ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు. వెళ్లిన ప్రతి టోర్నీలో గోల్డ్ మెడల్ సాధిస్తూ ఒలంపిక్స్ 2024 లో మెడల్స్ కంటెండర్స్ లో నిలిచారు. అందుకు తగ్గినా విధంగానే తన ఒలంపి ప్రయాణం విజయంతో ప్రారంభించారు.

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో గ్రూప్ C లో ఉన్న సాత్విక్, చిరాగ్ జోడి హోమ్ టీమ్ అయిన ఫ్రాన్స్ జోడిపై వరుస సెట్లలో విజయం సాధించారు. మొదటి సెట్ ను 21-17 తో సొంత చేసుకున్న ఈ గెలుపు గుర్రాలు రెండో సెట్ ను 21-14 తో గెలుచుకొని మొదటి మ్యాచ్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక తర్వాత మ్యాచ్ లో ఈ విన్నింగ్ జోడి జెర్మనీ ప్లేయర్స్ తో 29వ తేదీ సాయంత్రం 8:30 గంటలకు తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news