Telangana: కారు ఢీకొని.. మున్సిపల్ కార్మికుడి మృతి, 10 ఏళ్ల చిన్నారికి గాయాలు

-

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు ఢీకొని.. మున్సిపల్ కార్మికుడి మృతి చెందాడు. అలాగే… 10 ఏళ్ల చిన్నారికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ లోని వడ్డెర కాలనీ వద్ద కారు భీభత్సం ఘటన చోటు చేసుకుంది. కారు డ్రైవ్ చేసింది మైనర్లుగా గుర్తించారు మెదక్ పోలీసులు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.

నిన్న ఉదయం అతివేగంగా వచ్చి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడిని ఢీ కొట్టి అక్కడి నుంచి పరార్ అయ్యారు ఈ మైనర్‌ యువకులు. ఇక ఈ సంఘటనలో తీవ్ర గాయాలతో కార్మికుడు మైసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. 10 ఏళ్ల చిన్నారికి గాయాలు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా మైనర్ల కోసం గాలిస్తున్నారు మెదక్‌ పోలీసులు. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news