ఈ నెల 8న బ్యాంకులు, ఏటీఎంలు కూడా బంద్, ఎందుకంటే…?

-

ఈ నెల 8 బ్యాంకుల బంద్ కి బ్యాంకు యూనియన్లు పిలుపునిచ్చాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా బ్యాంకులు బంద్ కి పిలుపునిచ్చాయి. మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక చట్టాలను, బ్యాంకింగ్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఈ నెల 8న(బుధవారం) విధులకు రావొద్దని బ్యాంకు యూనియన్లు ఉద్యోగులను కోరాయి.

కేంద్ర ట్రేడ్ యూనియన్లు చేపడుతోన్న ఆల్‌‌ ఇండియా జనరల్ స్ట్రయిక్‌‌లో పాల్గొనాలని బ్యాంక్ యూనియన్లు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం తో ఈ సమ్మె ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులపై పడుతుంది. ఈ నెల 8 అన్ని బ్యాంకు బ్రాంచ్‌‌ల్లో జరిగే సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. అదే విధంగా మరో షాకింగ్ న్యూస్ ని వినియోగదారులకు బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.

ఈ సమ్మె ప్రభావం అత్యవసరంగా భావించే ఏటీఎం సేవలపై కూడా చూపనున్నట్టు బ్యాంకింగ్ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే ఆన్‌లైన్‌ ‌బ్యాంకింగ్ సేవలు మాత్రం ఈ సమ్మె పరిధిలోకి రావు. దీనిపై స్పందించిన ఆల్‌‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్(ఏఐబీఓసీ) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్తా సమ్మె రోజు ఏ విధమైన క్లరికల్ వర్క్‌‌ను చేపట్టవద్దని తమ సభ్యులను ఆదేశించామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news