ఐసెట్ అభ్యర్థులకు ముఖ్యగమనిక.. రేపటి నుంచి రెండో విడత కౌన్సెలింగ్

-

డిగ్రీ పూర్తయిన విద్యార్థులు పీజీ ప్రవేశాల కోసం రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐసెట్‌కు రేపటి (బుధవారం) నుంచి రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఐసెట్ అర్హత పరీక్ష ద్వారా పోస్టు గ్రాడ్యూయేషన్‌లో ప్రవేశాలు కల్పించనున్న విషయం తెలిసిందే. ఈనెల 7వ తేదీన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 9 నుంచి 14 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు.

15వ తేదీ నుంచి ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. మార్చుకోవడం ఇష్టం లేని వారు మొదట ఎంచుకున్న కాలేజీలోనే కొనసాగాల్సి ఉంటుంది. అయితే, ఈనెల 17వ తేదీ నుంచి సీట్లను కేటాయించనున్నారు. విద్యార్థులు ఈనెల 21లోపు తమకు సీట్లు కేటాయించిన కాలేజీలకు వెళ్లి రిపోర్టు చేయాల్సి ఉంటుందని ఐసెట్ బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలాఉండగా, ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో తరగతులు ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news