బంగాళఖాతంలో మరో అల్పపీడనం.. రేపు భారీ వర్షాలు వచ్చే అవకాశం..!

-

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళఖాతం-వాయువ్య బంగాళఖాతం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అల్పపీడనం ఉత్తరదిశగా కదులుతుండటంతో ఏపీలో ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అదేవిధంగా కోస్తాంధ్ర అంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ విధించారు. ఈ అల్పపీడనం కారణంగా తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు అధికారులు. రాబోయే మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా మత్స్య కారులు సముద్రంలోకి వెళ్లకూడదని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news