Telangana: రైలు కిందపడి.. రైల్వే కానిస్టేబుల్ ఆత్మహత్య !

-

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ నరసింహ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం పూట జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు నరసింహారాజు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ గోపాలపురం రైల్వేస్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నరసింహ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు.

Railway constable commits suicide after train falls

ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఆర్జిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు. కానిస్టేబుల్ నరసింహారాజు అంబర్పేట్ లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news