అబద్ధాలు చెప్పడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు : బండి సంజయ్

-

మోడీ వంద రోజుల పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు పెట్టాము. ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేసిందో చెప్పాలి అని ప్రశ్నించారు కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదు. ఈ విషయం పై మేము చర్చకు సిద్దం అని పేర్కొన్నారు. ఇది రైతు ద్రోహి ప్రభుత్వం. 6 గ్యారంటీ లలో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు అన్నారు బండి సంజయ్.

అలాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. కేంద్రం అన్ని విషయాల్లో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయాలని అనుకుంటుంది. అబద్ధాలు చెప్పడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించింది… అప్పుడు ప్రజా పాలన జరగలేదా.. కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ కన్నా నిజాం పైన, రజాకార్ల పైన MIM పైన ఎక్కువ ప్రేమ అని అన్నారు బండి.

Read more RELATED
Recommended to you

Latest news