మా సీఎం పరదాలు కట్టుకు తిరిగే సీఎం కాదు : నారా లోకేష్

-

రాష్ట్రంలో కన్సల్టెంట్ ఫోరమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. దీనిపై వారం రోజుల్లో జీఓ ఇస్తాం అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. ఎన్ని ప్రభుత్వాలు మారినా గవర్నెన్స్ అనేది మారకూడదు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో పిపిఏ ల విషయంలో దెబ్బతిన్నాం. అయితే ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ధ్యేయం అని లోకేష్ పేర్కొన్నారు. అలాగే ఏపీలో పెట్టుబడులు పెడితే ఇన్సెంటివ్స్ ఇస్తాం.. గతంలో పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఒక యువ ఐఏఎస్ ను ఈడీబీ సీఈఓగా పెట్టాం అని లోకేష్ అన్నారు.

అలాగే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తీవ్ర చర్చగా మారిన తిరుపతి అంశంపై స్పందించిన లోకేష్.. గత ప్రభుత్వం లాగా సీక్రెట్ జీఓ లు మేం ఇవ్వడం లేదు. మా సీఎం చంద్రబాబు పరదాలు కట్టుకు తిరిగే సీఎం కాదు అన్నారు. అలాగే నేను ఛాలెంజ్ చేసి తిరుపతిలో 24 గంటలు ఉన్నా.. కానీ ఎందుకు వచ్చి నన్ను ఛాలెంజ్ చేయలేదు అని లోకేష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news