బెంగళూరులో షాకింగ్.. లేడీస్ వాష్‌రూంలలో స్పై కెమెరాలు

-

బెంగళూరులో షాకింగ్ వ్యవహారం వెలుగుచూసింది. కుంబల్‌గోడు ఏసీఎస్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఓ విద్యార్థి అమ్మాయిల బాత్రూమ్స్‌లో స్పై కెమెరాలను అమర్చాడు. అనంతరం అమ్మాయిల వీడియోలను తన మొబైల్‌ ఫోన్‌లో స్టోర్ చేసుకున్నాడు.ఈ విషయం బయటకు ఎలా లీకైందో తెలీదు.కాలేజీ మొత్తం వ్యాపించడంతో విద్యార్థినులు ఆగ్రహంతో ఊగిపోయారు. కాలేజీ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.వాష్‌రూంలలో స్పై కెమెరాలు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు.ఈ ఘటన వెనక హస్తమున్న ఫైనలియర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.అదే విధంగా వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్‌ను కూడా సీజ్ చేశారు. విద్యార్థినులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.కాగా,నిందితుడి మొబైల్ ఫోన్‌లో 7, 8 వీడియోలను సేవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news