పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మాట్లాడారు.. మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

-

తిరుపతి లడ్డు వివాదం పై ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు  కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డు అంశం చాలా సున్నితమైనదని దీని గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ గా మాట్లాడారని తెలిపారు. తాను కూడా తిరుపతికి చెందిన వాడినేనని ఇక్కడ ఎవరికీ కమ్యూనిటీ ఫీలింగ్ లేదన్నారు. జానీ మాస్టర్ వ్యవహారాన్ని ఫిలిం ఛాంబర్ చూసుకుంటుందని చెప్పారు మంచు విష్ణు.

an

గత ప్రభుత్వ హయాంలో తిరుమల క్షేత్రాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి అపవిత్రం చేశారని.. సీఎం నారా చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజులుగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం విధితమే. దేశవ్యాప్తంగా ఈ అంశం పెను తుమారం రేపుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తీవ్ర విమర్శలు ప్రతివిమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశించింది. మరోవైపు పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజు మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news