కర్నూలు విండ్ పవర్ సబ్ స్టేషన్ పై వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి

-

కర్నూల్ జిల్లాలో వైసీపీ నాయకుల ప్రధాన అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక ఎమ్మెల్యే విరూపాక్ష సోదరుడు, ఆయన అనుచరులతో కలిసి ఆలూరు మండలం మొలగవల్లి, జోహారపురం సమీపంలో విండ్ పవర్ సబ్ స్టేషన్ పై ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు దాడి చేశారు. అడ్డువచ్చిన అధికారులను చితకబాదారు.

కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకి ఎదురు సమాధానాలు చెబితే ప్రాణాలు తీస్తామంటూ సిబ్బందిని, అధికారులను బెదిరించారు. విండ్ పవర్ వ్యవహారంలో ఎమ్మెల్యే విరూపాక్షి, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ మధ్య వివాదం ఉన్నట్లుగా సమాచారం.

దీంతో మా ఎమ్మెల్యేని కలవకుండా విధులు నిర్వహిస్తారా అంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పిలిచినప్పటికీ వచ్చి కలవరా..? అంటూ ఫర్నిచర్ ధ్వంసం చేశారని విద్యుత్ సంస్థ ఉద్యోగులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news