11 మంది ఐఏఎస్ లకు షాక్.. విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం..!

-

తెలంగాణలోని ఏపీ కేడర్ ఐఏఎస్ లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఐఏఎస్ రొనాల్డ్ రోస్ తో సహా మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. 11 మంది ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏపీకి చెందిన వారు ఏపీలోనే ఉండాలని.. తెలంగాణలో కొనసాగడం అవసరం లేదని.. అలాగే తెలంగాణ చెందిన వారు కొంత మంది ఏపీ నుంచి తెలంగాణకు రావాలని ఆదేశించింది కేంద్రం. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ మళ్లీ మారే అవకాశం కనిపిస్తోంది. నూతన జీహెచ్ఎంసీ కమిషనర్ ఎవ్వరూ వస్తారని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news