రేవంత్ రెడ్డి నలుగురు బ్రదర్స్ కోసమే ఫోర్త్ సిటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

సీఎం రేవంత్ రెడ్డి తన నలుగురు బ్రదర్స్ కోసం, వాళ్ల రియల్ ఎస్టేట్ దందా కోసమే ఫోర్త్ సిటీ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన దసరా సమ్మెళనం అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఫార్మాసిటీ రద్దు అయిందని చెబుతున్న రేవంత్ రెడ్డి.. కోర్టులో మాత్రం ఫార్మాసిటీ ఉందంటున్నారు. ప్రభుత్వం ఎంత దొంగ ప్రభుత్వమో వాళ్లు కోర్టుకు చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవాలన్నారు.

ఫార్మాసిటీ విషయంలో హైకోర్టులో న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని, గల్లీ గల్లీ తిరిగి రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందన్నారు. దమ్ముంటే ఫార్మాసిటీ కట్టు.. లేదంటే వాళ్ల భూమి వాళ్లకు ఇచ్చేయ్ అని డిమాండ్ చేశారు కేటీఆర్. రియల్ ఎస్టేట్ చేస్తా.. నా వాళ్లకు భూములు కట్టబెడుతా అంటే బీఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news