165 ఏఈవోలు 20 మంది కానిస్టేబుళ్ల సస్పెండ్..కేటీఆర్ సీరియస్ !

-

165 ఏఈవోలు 20 మంది కానిస్టేబుళ్ల ను సస్పెండ్ చేశారు. అయితే దీనిపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమే అన్నారు. సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకే. అడ్డగోలు సాకులతో సస్పెన్షన్ లు – హక్కులు అడిగితే వేటేయ్యడాలు అంటూ చెప్పారు.

165 AEOs 20 constables suspended

2 లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు – ఉన్న ఉద్యోగాలను రేవంత్ సర్కార్ ఊడపీకుతున్నాయి అంటూ ఆగ్రహించారు. 165 ఏఈవో లు 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. బీఆర్ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం – కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం. నాడు, నేడు, ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు బిఆర్ఎస్ అండగా ఉంటుంది అని చెప్పారు. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలి,రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అంటే ప్రజలు తిరస్కరించిన వారికీ పాలన అప్పచెప్పడమేనా ? అని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news