పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం !

-

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో… తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన… ఎమ్మెల్యేల కేసును ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది. అయితే ఈ కేసును విచారించిన అనంతరం వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. నాలుగో తేదీన తుది తీర్పు వెలువరించే.. ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా నెల రోజుల కిందట సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజనల్ బెంచ్ లను ఆశ్రయించారు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ.

దీంతో ఈ కేసు వాయిదా పడింది. గులాబీ పార్టీ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు… విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ తరుణంలోనే… ఎమ్మెల్యేలపై కేసు వేసింది గులాబీ పార్టీ. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై… త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీకి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలోనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news