జగన్ కి చెల్లిపై ప్రేమ లేకుంటే ఆస్తులు ఎందుకు రాసిస్తారు : పేర్ని నాని

-

జగన్ కి చెల్లి మీద ప్రేమ లేకుంటే ఆస్తి ఎందుకు రాసిస్తారు అని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్, షర్మిల ఆస్తులపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  తండ్రి చనిపోయినా ఇన్ని ఏండ్లకు ఎవరైనా ఆస్తులు పంచుతారా..? ప్రశ్నించారు. షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులను ఇప్పటికే జగన్ ఇచ్చారు. చంద్రబాబు తన ఆస్తిలో ఎవరికైనా చెల్లెల్లకు పంచారా..? అని ప్రశ్నించారు. 

సోనియాగాంధీ, చంద్రబాబు కుట్ర ఆస్తులు ఈడీ అటాచ్ లో ఉన్నాయి. ఈడీ అటాచ్ మెంట్ లో కోర్టు కేసులు అయిపోయిన తరువాత వాటిని పంచుకునే పరిస్థితులుంటాయి. కాబట్టి ఎంవోయూ ఆగస్టు 31, 2019లో రాసుకున్నారు. భారతి సిమెంట్ 40 శాతం వాటా షర్మిలకు రాసిచ్చారు. చంద్రబాబు ఎప్పుడైనా ఎవరికైనా ఆస్తి రాసిచ్చారా..? అని ప్రశ్నించారు. సరస్వతీ పవర్ ఇండస్ట్రీలో, కేరమిల్లి వంటి పలు కంపెనీలలో షర్మిల కు వాటాలు ఇచ్చారని తెలిపారు. జగన్ కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు పేర్ని నాని. 

Read more RELATED
Recommended to you

Latest news