కేరళ సీఎం కాన్వ్‌య్‌కి ఆక్సిడెంట్..!

-

కేరళ సీఎం పినరయివిజయన్ కాన్వ్‌య్‌కి ఆక్సిడెంట్ జరిగింది. సీఎం ఎస్కార్ట్ వాహనాలే ఒక్కదానిని మరొకటి గుద్దుకున్నాయి. అయితే ఈ ఘటనలో తృటిలో ప్రమాదం తప్పింది. అయితే కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వామనపురం రోడ్డుపై సీఎం ఎస్కార్ట్ వాహనాలు ఒక్కదాని వెంట ఒక్కటి వేగంగా వస్తున్నాయి. అయితే సీఎం కాన్వాయ్ వస్తుంటే రోడ్డుపైకి వేరే వాహనాలు రానివ్వరు. కానీ ఇక్కడ మాములు ప్రజల వాహనాలు కూడా రోడ్డుపై వెళ్తున్నాయి.

అయితే సీఎం కాన్వాయ్ ఓ బండిని ఓవర్ టెక్ చేసి ముందుకు వెళ్లే సమయంలో.. ముందు ఉన్న ఓ టూ విల్లర్ కాన్వాయ్ ముందు నుండి రోడ్ క్రాస్ చేసింది. ఒక్కసారిగా బండి అడ్డు రావడంతో ఎస్కార్ట్ లోని మొదటి బండి సడెన్ బ్రేక్ వేసింది. దాంతో వేణునా వస్తున్న ఎస్కార్ట్ బండ్లు అన్ని ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఐదు ఎస్కార్ట్ వాహనాలు ధ్వంసం కాగా.. సీఎం పినరయివిజయన్‌కు ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news