తెలంగాణ ఉద్యమ నేత కేసిఆర్ కు కల్వకుంట్ల కవిత లేఖ రాయడంపై తొలిసారిగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. BRS పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ లేఖలు రాయడం సహజం. కవిత లేఖ పెద్ద విషయం కాదు. అంతర్గత విషయాలు బయట మాట్లాడడం సరికాదు.

లోపల మాట్లాడితేనే మంచిది. పార్టీలో అందరం కార్యకర్తలమే అందరం సమానమే.’ అని వ్యాఖ్యానించారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి.. ఆ దయ్యాన్ని ఎలా వదలకొట్టాలి అనేదే మా తాపత్రయం అన్నారు కేటీఆర్.
పార్టీలో అంతర్గతంగా చెప్పాల్సిన విషయాలు బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఫైర్ అయ్యారు కేటీఆర్. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. గతంలో యడ్యూరప్ప హౌసింగ్ స్కామ్కు పాల్పడినప్పుడు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారన్నారు.