తెలంగాణ, ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. రెండు తెలుగు రాష్ట్రాలకు మూడు రోజులు వర్షాలు పడనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు AP, TGలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడవచ్చు. తెలంగాణలో శని, ఆది, సోమవారాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.