జవాన్ నర్సింహమూర్తి సెల్ఫీ వీడియోకి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, తన భూమిని తనకు ఇప్పించి సమస్య పరిష్కరించారని చెబుతూ మరో వీడియో విడుదల చేసాడు. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్కి, సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జవాన్ నర్సింహమూర్తి.

అంతకు ముందు తన భూమిని కబ్జా చేశారంటూ జవాన్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు తన భూమిని కబ్జా చేసి, తన కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఎన్నిసార్లు పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వీడియోలో పేర్కొన్న జవాన్ నర్సింహమూర్తి… మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ తరుణంలోనే జవాన్ నర్సింహమూర్తి సెల్ఫీ వీడియోకి మంత్రి నారా లోకేశ్ స్పందించారు.