గులాబీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ భవన్కు తాళం వేసారు పోలీసులు. ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లిన వెంటనే.. భవన్కు తాళం వేసేసారు పోలీసులు. కేటీఆర్ వెంట ఏసీబీ ఆఫీస్కు కార్యకర్తలు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే తెలంగాణ భవన్కు తాళం వేశారు.

దీంతో.. ఇది ప్రజాస్వామ్యమా? పోలీసుల రాజ్యమా? అంటూ మండిపడుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ భవన్కు తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. అటు తెలంగాణ భవన్ సమీపంలోని నీలోఫర్ కేఫ్ను మూసివేసారు పోలీసులు. కస్టమర్లను బయటకు పంపించేసి.. బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. ప్రజా పాలన అంటే ఇదేనా? అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.
తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఏసీబీ ఆఫీస్ వైపు వెళ్లకుండా.. బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
ఈ నేపథ్యంలోనే.. పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య నెలకొన్న వాగ్వాదం
దీంతో.. సీఎం డౌన్ డౌన్, ఇది దొంగల రాజ్యమంటూ పార్టీ శ్రేణుల నినాదాలు#TelanganaBhavan #KTR #ACB… pic.twitter.com/dgKz494EUc
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 16, 2025