ఏపీలో కొత్త హైవే.. ఇక హైదరాబాద్ కు 8 గంటలే జర్నీ!

-

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవేను నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ దేవరపల్లి – ఖమ్మం మధ్య నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం తుది దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రహదారిని ప్రారంభించినట్లయితే హైదరాబాద్, విశాఖపట్నం మధ్య దూరం దాదాపు 125 కిలోమీటర్లు తగ్గుతోంది. వచ్చే ఆగస్టు నాటికి ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.

road
road

ఖమ్మం నుండి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ హైవేతో ప్రయాణ సమయం కొంతమేరకు తగ్గనుంది. ఈ హైవేను రూ. 4,609 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ హైవే మీదుగా విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేవారు కేవలం ఎనిమిది గంటలలో వారి గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. దీంతో హైదరాబాద్ విశాఖపట్నం వెళ్లేవారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వారి ప్రయాణ సమయాన్ని కొంత మేరకు తగ్గించినందుకు సంతోషపడుతున్నారు. ఇన్ని రోజులు ప్రయాణం చేయడానికి చాలా సమయం వృధా అవుతుందని ఇంటికి వెళ్లే వారమే కాదని ఇకనుంచి ఇంటికి చేరుకోవడానికి ఎక్కువ సమయం వృధా అవ్వదని ప్రయాణికులు సంతోషపడుతున్నారు. తొందర్లోనే ఈ హైవేను ప్రారంభించాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news