ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో ఇవాళ మధ్యాహ్నం వరకే పాఠశాలలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు విద్యార్థులతో యోగా కూడా చేయించబోతున్నారు.

అలాగే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. అనంతరం 9 గంటల నుంచి ఈ మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేశాక సెలవు ఇస్తారు. అటు విశాఖపట్నంలో ఇవాళ పూర్తిగా హాలిడే కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు సంబరపడిపోతున్నారు.