ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు శుభవార్త అందింది. డ్వాక్రా మహిళల ఆదాయాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు వెదురు సాగు చేయనున్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 10 వేల మంది మహిళలను వెదురు సాగు వైపు ప్రోత్సాహించాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం.

ఉపాధి హామీ పథకం కింద మొక్కలను ఉచితంగా అందిస్తారు. అంతే కాకుండా సాగు కు అవసరమయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది. మొదటి దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెదురు ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో డ్వాక్రా మహిళలు రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు డబ్బులను సంపాదించవచ్చు. కూటమి ప్రభుత్వం అందించిన ఈ పథకంతో డ్వాక్రా మహిళలు భారీగా డబ్బులను సంపాదించి ఆదాయం పొందవచ్చు. దీంతో మహిళలు సంతోషపడుతున్నారు.