వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. కీలక నేతలను సస్పెండ్ చేసింది వైసీపీ పార్టీ.. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసింది వైసీపీ పార్టీ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో క్రమ శిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంది వైసీపీ పార్టీ హై కమాండ్.

వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకే వస్తుందని ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో ప్రకటించారు నవీన్ నిశ్చల్. ఈ తరుణంలోనే మాజీ ఇన్చార్జి, నవీన్ నిశ్చల్ , కొండూరు వేణుగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేసింది వైసీపీ అధిష్టానం. కాగా హిందూపురం బలమైన నేతగా గుర్తింపు పొందారు నవీన్ నిచ్చల్.