చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నికలు కావొచ్చు.. ఇప్పటికైనా కృష్ణా రామా అనుకుంటే పుణ్యమైన వస్తుంది, లేదంటే నరకానికి పోతావు అని షాకింగ్ కామెంట్స్ చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చంద్రబాబు నీకు దమ్ముంటే మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిపించాలని… కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించండి అని పేర్కొన్నారు.
jagan on chandrababu naidu over press meetప్రతి బూత్లో వెబ్ కాస్టింగ్ ఇచ్చే ధైర్యం ఉందా? పోలింగ్ బూత్ ఆవరణలో సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం ఉందా? అని వైఎస్ జగన్ వెల్లడించారు. టిడిపి మాజి ఎంపీ అల్లుడు పులివెందుల డీఐజీ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. పులివెందుల ఉప ఎన్నికలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చ చొక్కా వేసుకున్నట్టు ఎన్నికల్లో దౌర్జన్యాన్ని దగ్గరుండి చూసుకున్నాడని మండిపడ్డారు.