ఢిల్లీ మత ప్రార్థనలో సంచలన విషయాలు బయట పెట్టిన ;కేంద్ర హోం శాఖ

-

ఢిల్లీలోని మత ప్రార్ధనలకు వెళ్ళిన వారి విషయమై కేంద్ర హోం శాఖ సంచలన విషయాలను వెల్లడించింది. ‘నిజాముద్దీన్‌’ ప్రధాన కేంద్రంగా తబ్లీగ్‌-ఎ-జమాత్‌ అనే సంస్థ నిర్వహించిన సమావేశాలు ఇప్పుడు కరోనా కేంద్ర౦గా మారాయి. తాజాగా వీటిపై కేంద్ర హోం శాఖ ఒక నివేదికను బయటపెట్టింది. ఆ నివేదిక ఆధారంగా చూస్తే… ఈ మత కార్యకలాపాల్లో పాల్గొనేందుకు గానూ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటివరకు మొత్తం 2100 మంది విదేశీయులు పాల్గొన్నారని తన నివేదికలో స్పష్టం చేసింది కేంద్ర హోం శాఖ…

1203 మంది తబ్లిగ్ జమాత్ కార్యకర్తలను పరీక్షించగా వారిలో 303 మందిక కరోనా లక్షణాలున్నాయని తెలిసింది. ఢిల్లీలోని నరేలా, బక్కర్ వాలా, సుల్తాన్ పురి ప్రాంతాల్లోని నిర్బంధ కేంద్రాలకు వారిని తరలించారు. మార్చి నెలలో జరిగిన సమావేశాలే కాకుండా ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా వివిధ మసీదులు కేంద్రాలుగా తబ్లిగ్ జమాత్ కు చెందిన దేశ, విదేశీ కార్యకర్తలు ఛిల్లా పేరిట బోధనల్లో పాల్గొంటారని తన నివేదికలో వెల్లడించింది.

ఈ తబ్లిగ్ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల నుంచి పెద్దసంఖ్యలో హజ్రత్ నిజాముద్దీన్ లోని బంగ్లేవాలీ మసీదు వద్ద ఉన్న తబ్లిగ్ మర్కాజ్ వద్దకు వచ్చారని హోంశాఖ అధికారులు చేసిన రహస్య నివేదికలో వెల్లడైంది. విదేశీయులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని రాష్ట్ర అమీర్ ల పర్యవేక్షణలో మసీదుల్లో చిల్లా కార్యక్రమాలు చేపట్టారని కూడా హోం శాఖ తన నివేదికలో వెల్లడించింది.

మార్చి 21 వతేదీ నాటికి హజ్రత్ నిజాముద్దీన్ మర్కాజ్ లో 1746 మంది ఉండగా వీరిలో 216 మంది విదేశీయులు, 1530 మంది భారతీయులు ఉన్నారని గుర్తించారు. వీరితోపాటు మరో 824 మంది విదేశీయులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిల్లా కార్యక్రమాల్లో ఉన్నారని హోంశాఖ తన నివేదికలో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news