డాలర్ల పిచ్చితో అమెరికా వెళ్లి, భారత్ ని తిట్టడం ఏంటి…?

-

అమెరికా ఎవరు వెళ్ళినా సరే డాలర్ల కోసం, విలాసవంతమైన జీవితం కోసమే వెళ్తారు అనేది వాస్తవం. అది కాదు మేము దేశ సేవ కోసం వెళ్లాం అంటే అది మీడియాలో, సోషల్ మీడియాలో హడావుడి కోసమే. అంతే గాని ఎవరూ కూడా దేశం కోసం వెళ్ళేది ఎవరూ ఉండరు. ఇప్పుడు అమెరికాలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. అక్కడ ఇప్పుడు దాదాపు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

అది ఎవరూ ఏమీ చేయలేని స్థితి… కొంత మంది అతి గాళ్ళు మమ్మల్ని అమెరికా పట్టించుకోవడం, మోడీ పట్టించుకోవడం, మాకు దిక్కు లేదు అంటూ సోషల్ మీడియాలో వాపోవడం ఆశ్చర్యంగా మారింది. సోషల్ మీడియాలో హడావుడి చేసి మోడీ సర్కార్ ని తిడుతున్నారు. అమెరికా ప్రజలకే అక్కడ దిక్కు లేదు. డాలర్ల పిచ్చితో వెళ్లి ఇక్కడి ప్రభుత్వాలను విమర్శించడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది.

మీ అవసరాల కోసం మీరు వెళ్ళారు గాని ఎవరికో సహాయం చేయడానికి కాదు. దయచేసి ప్రభుత్వాలను విమర్శించడం మానుకుంటే మీకు అందరికి మంచిది. అంతే గాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిరాకు పెట్టకండి. ఇక్కడ వాళ్లకు ఎం చెయ్యాలో కూడా ప్రభుత్వాలకు అర్ధం కావడం లేదు. దయచేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సోషల్ మీడియాలో హడావుడి చేయవద్దు. ఆ డాలర్లు కాపాడతాయేమో చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news