మద్యం – కరోనా – లాక్ డౌన్ : వీటి గురించి WHO చెప్పిన నిజాలు !

-

కరోనా వైరస్ అరికట్టే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పలు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేస్తుంది. మందులేని ఈ వైరస్ కి వ్యాక్సిన్ వచ్చేదాకా నియంత్రణ ఒకటే మార్గమని దేశాలను ముందునుంచే హెచ్చరిస్తుంది. దీంతో WHO ఆదేశాల మేరకు లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా దేశాలు అమలు చేస్తున్నాయి.How much you drink may depend on fellow drinkers - Mangalorean.comదీంతో కరోనా వైరస్ ఎఫెక్టుతో ప్రపంచ దేశాలు చాలావరకూ లాక్ డౌన్ అమలు చేయటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి ఖాళీ సమయం లో ఎక్కువగా ఇళ్లల్లో మద్యం సేవిస్తూ గొడవ పడుతున్నారు అని, వైరస్ ను అరికట్టే కంటే ఈ గొడవలు ప్రస్తుతం బాగా బయటపడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ గా కరోనా తర్వాత వినబడుతున్న వార్తలు ఇవే. అయితే మందు తాగి గొడవ చేసేవాళ్లు గురించి సంచలన నిజాలు బయట పెట్టింది WHO. ఇటువంటి కీలక టైంలో వైరస్ తో పోరాడే సమయంలో ప్రజలు ఎవరు మద్యం సేవించ వద్దని సూచించింది.

 

అంతేకాకుండా మద్యం తాగితే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని.. ఆ శక్తి తగ్గితే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరించింది. కుటుంబం కోసం మీ ఆరోగ్యం కోసం ప్రస్తుతం మద్యం మానేయండి అని డబ్ల్యూహెచ్ఓ కోరుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలకు కూడా సలహా ఇచ్చింది. ఈ సమయంలో ప్రజలకు మద్యం అందుబాటులో ఉండకుండా చేయాలని మద్యం నియంత్రించాలని సూచనలు చేసింది. దీనికి సంబంధించి ఓ నివేదిక కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news