విజయ డైరీ రైతులకు శుభవార్త

-

విజయ డైరీ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాల సేకరణ ధర పెంచుతున్నట్లు రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. పాల సేకరణ ధర పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన పాడి రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

లీటర్‌ గేదె పాల ధర రూ.46.99 నుంచి రూ.49.40కు, ఆవు పాల ధర రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని పేర్కొన్నారు. పాడి గేదెలకు ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ తెలంగాణ ఏర్పడ్డాక లాభాల్లోకి వచ్చిందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news