పాడి పశువుల్లో వచ్చే పాల జ్వరం, నివారణ చర్యలు..

-

మన దేశంలో పాడి పశువులు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. పాల ఉత్పత్తిని మరింత పెంచెందుకు ప్రభుత్వాలు కొత్త పద్దతులను అనుసరిస్తున్నారు.ఇకపోతే గేదె లేదా ఆవు ఈనక ముందు తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు, ఈనే 5 రోజుల ముందు నుండి విటమిన్ డి ఇంజక్షన్లు ఇవ్వాలి. అధిక పాలిచ్చే పశువులు ఈనిన తర్వాత ప్రారంభంలో, పాలు పూర్తిగా పితకకూడదు..

పాలిచ్చే ఆరోగ్యవంతమైన పాడి పశువుల్లో రక్తంలోని కాల్షియం పరిమాణం ఆకస్మాత్తుగా తగ్గిపోవడం, తద్వారా రక్తప్రసారంలో అంతరాయం, కండరాల బలహీనత, వెనుకకాళ్ళ పడిపోవడం, ఆపస్మారకస్థితికి లోనై మరణించడం జరుగుతుంది.  పోషక లోపం వల్ల ఇలా జరుగుతుంది. దీనినే పాలజ్వరం అని పిలుస్తుంటారు. దీనికి సకాలంలో చికిత్స అందిస్తే పశువులు బతికి బయటపడే అవకాశాలున్నాయి.

ముఖ్యముగా జఫార్ బాడి, జెర్సీ ఆవులలో ఇది ఎక్కువగా ఉంటుంది. పశువులు ఈనిన మొదటివారంలో వస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా 5,10 సం.ల వయస్సున్న పాడిపశువుల్లో ఎక్కవగా వస్తుంది. వ్యాధి లక్షణాలు మూడు దశలలో ఉంటాయి. మొదటి దశలో పాలజ్వరంతో బాధపడే పాడిపశువులు ప్రారంభదశలో మేత సరిగ్గా మేయకపోవడం, నెమరు వేయకపోవడం, పళ్ళు కొరకుతూ బెదురుచూపులతో చికాకుగా ఉండి, వణకుతూ కదలలేకుంటాయి.ఈ పాల జ్వరం వచ్చిన వాటికి జ్వరం కలిగి ఉండకుండా, వ్యాధి ప్రారంభంలో శరీర ఉష్ణోగ్రత మామూలుగా ఉండి, ఆతర్వాత సాధారణ స్థాయి కన్నా తగ్గి చల్లగా మారుతుంది.

పశువులు సరిగ్గా నిలబడలేకపోతాయి. శ్వాస, నాడి తగ్గి పశువులు కదలకుండా ఉంటాయి. ఈ స్థితిలో పాడి పశువులు తలను పొట్టపై డొక్కలో ఆనించి “S” ఆకారంలో ఉండి మగతగా పడుకుని ఉంటాయి. వ్యాధి చివరిదశలో శ్వాస, నాడివేగం పడిపోతుంది. పశువు ఒకవైపు పడిపోవడం, తద్వారా కడుపు ఉబ్బరం మొదలగు లక్షణాలు కనబడతాయి. కండరాల వణకుతో, చలనం లేకుండా, అపస్మాకర స్థితిలోకి వెత్తాయి..అలాంటి వాటిని వెంటనే గుర్తించి వెంటనే సరైన చికిత్సను అందించాలి..లేకుంటే మాత్రం అవి చనిపొయె ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది..

అయితే ,రోగనిర్ధారణ కాగానే కాల్షియం బోరూ గ్లూకొనేటుఇంజెక్షనును  400-800 మి.లీ. రక్తనాళాల్లోకి ఇవ్వటం ద్వారా 75 నుండి 85 శాతం పాడిపశువుల్ని రక్షించుకోవచ్చు అవసరమైతే రోజు  వ్యవధిలో మూడుసార్లు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పశువులు ఈనే 24 గంటల ముందు, ఈనిన తరువాత 10  గంటల తర్వాత రోజుకు మూడుసార్లు 150 గ్రా.ల కాల్షియం తాగించడం ద్వారా పాలజ్వరం రాకుండా జాగ్రత్త పడవచ్చు. చూడి, పాడి పశువులు అనవసరపు ఉద్రేకతలకు గురికాకుండా చూడాలి. దాణాలో జొన్నలు పెట్టడం మేలు..పశువులను చలినుండి సంరక్షించాలి. వ్యాధి నివారణకై అమ్మోనియం క్లోరైడ్ 25 గ్రా చొప్పున చూలి చివరి వారాల్లో అందిస్తూ, ఈనే సమయానికి 100 గ్రా. ప్రతిరోజు అందివ్వాలి. అదే సమయంలో పశువైద్యుని సంప్రదించి వైద్యాన్ని అందించాలి..

Read more RELATED
Recommended to you

Latest news