అక్కడ సరే, ఆ మ్యాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా….??  

-

ప్రస్తుతం శర్వానంద్, సమంత ల కలయికలో తెరకెక్కుతున్న తాజా సినిమా జాను. ఇటీవల రెండేళ్ల క్రితం యువ దర్శకుడు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన 96 అనే లవ్ స్టోరీ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ జాను సినిమాకు కూడా ప్రేమ్ కుమారే దర్శకత్వం వహించడం విశేషం. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాలో శర్వానంద్, రామ్ అనే పాత్రలో నటిస్తుండగా, జానకిగా సమంత నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి గోవింద వసంత కంపోజ్ చేసిన సాంగ్స్ మంచి హిట్ సాధించగా మరొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు.

అయితే అక్కడ హీరో, హీరోయిన్లుగా నటించిన విజయ్ సేతుపతి, త్రిష ఇద్దరూ కూడా తమ పాత్రల్లో ఎంతో ఒదిగిపోయి నటించడం జరిగింది. ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాలోని కొన్ని సీన్స్ లో త్రిష పెర్ఫార్మన్స్ కు మరింత మంచి మార్కులు పడ్డాయి. అయితే తెలుగులో ఆ పాత్రలో నటిస్తున్న సమంత కూడా అదరగొట్టినట్లు టాక్. ఇకపోతే ఏ మాత్రం కమర్షియల్ హంగులు లేకుండా హృదయానికి హత్తుకునే ఒక బేసిక్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ,

 

తెలుగు ప్రేక్షకులు ఇటువంటి సినిమాలను ఎంతవరకు ఆదరిస్తారు అనే దానిపై కొందరి నుండి మాత్రం సందేహం వ్యక్తం అవుతోంది. అయితే ఏ సినిమాలో అయినా బలమైన కథ, కథనాలు ఉండి, అవి థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడిని ఆకట్టుకుంటే చాలని, దానికి ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ ఉండవలసిన అవసరం లేదని అంటున్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఎన్నో అంచనాలతో మరొక మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news