మన్మథుడు-2 వచ్చేస్తుంది

-

కింగ్ నాగార్జున హీరోగా విజయ్ భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మన్మధుడు దశాబ్ధం క్రితం వచ్చిన ఈ సినిమాకు త్రివిక్రం కథ మాటలు అందించాడు. సినిమా సక్సెస్ లో త్రివిక్రం మాటలు ఎక్కువ బాధ్యత వహించాయి. ఈ సినిమా టైటిల్ కు నాగార్జున మాత్రమే పర్ఫెక్ట్ అనేలా సినిమా ప్రేక్షకాదరణ పొందింది.

ఇక ఈ సినిమాకు పార్ట్ 2 చేసే ఆలోచనలో ఉన్నారట. ఈమధ్య నాగార్జున మన్మధుడు-2 టైటిల్ అన్నపూర్ణ బ్యానర్ లో రిజిస్టర్ చేయించారట. నాగార్జున మళ్లీ మన్మధుడిగా కనిపిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈసారి మన్మధుడిగా నాగ్ తనయుళిద్దరిలో ఒకరు చేయనున్నారని టాక్.

నాగార్జున వారికోసమే ఈ సినిమా టైటిల్ రిజిస్టర్ చేయించాడట. చిలసౌ ప్రెస్ మీట్ లో ప్రస్తుతం బంగార్రాజు స్క్రిప్ట్ పని జరుగుతుందని చెప్పిన నాగార్జున తమిళంలో ధనుష్ డైరక్షన్ లో మూవీ కూడా కన్ఫాం చేశాడు. మరి మన్మధుడు-2 నాగార్జున చేస్తాడా లేక నాగ చైతన్య, అఖిల్ లకు వదిలేస్తాడా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news