సలార్ టికెట్ కొన్న దర్శక ధీరుడు… ధర ఎంత అంటే

-

ప్రశాంత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం అని మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ కర్ణాటకలో ప్రారంభం కాగా ఈరోజు మన తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు. అయితే సలార్ తొలి టికెట్ ని దర్శక ధీరుడు రాజమౌళి కొన్నాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎంఎం థియేటర్లో ఈ టికెట్ను 10,116 రూపాయలకు బుక్ చేసుకున్నాడు. సినిమా విడుదలైన రోజున రాజమౌళి ఈ సినిమాని వీక్షించ బోతున్నాడు.దీనితో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాకుండా హీరో ప్రభాస్ మరియు కేరళ నటుడు పృథ్వి రాజ్ కుమార్లతో హీరోయిన్ శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి రవి బసురుర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్విరాజ్ కుమారన్,జగతి బాబు, ఈశ్వరి కుమారి మొదలైన వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news