ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు….. బీఆర్ఎస్ నేత

-

నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డాడు. మాటలు కోటలు దాటుతున్నాయని ఇప్పుడే గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడుగుతే ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తే ఇంకా ఆయన సీఎం అయినట్లు భావించడం లేదు.. సీఎం అయినా హుందాతనం లేకుండా మాట్లాడుతున్నారు.. మాటలేమో ప్రజాస్వామ్యం, చేతలేమో నిరంకుశత్వంగా ఉన్నాయని పీవీ నరసింహ రావుని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించాడు.గొంగట్లో అన్నం తినుకుంటూ వెంట్రుకల కోసం చూసినట్టు ఉందని ఎద్దేవా చేశాడు. ఈ సమయంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాజకీయపరంగా విమర్శలు చేయడం సరికాదు అని అన్నాడు.

హరీష్ రావు మాట్లాడుతూ మా గొంతును ఎందుకు నొక్కుతున్నారని గుమ్మడికాయ దొంగలు ఎవరు అని అడిగితే భుజాలన్నీ తడుముకుంటున్నట్లు ఉందని కనీసం మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన నర్సింహారావు చనిపోతే వెళ్ళని పార్టీ మీది అని దుయ్యబట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news