2.ఓ సెన్సార్ పూర్తి

-

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వల్ గా వస్తున్న సినిమా 2.ఓ. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న 2.ఓ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ అందించడం విశేషం. అంతేకాదు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారట.

శంకర్ క్రియేటివిటీ, రజిని స్టైల్ కలిసి 2.ఓ సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయం అన్నట్టుగా సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్. సినిమాలో విలన్ గా అక్షయ్ కుమార్ కూడా అదరగొట్టాడని తెలుస్తుంది. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన 2.ఓ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందించారు. నవంబర్ 29న రాబోతున్న చిట్టి రోబో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news