ఒక్కొక్కరికి 15 వేలు పిండి ప్యాకెట్ తో పంపిన అమీర్ ఖాన్…!

-

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏదోక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ప్రతీ రోజు ఏదోక వీడియో, ఫోటో విస్తృతంగా వైరల్ అవుతూ వస్తు౦ది. ఆధారాలు లేకపోయినా సరే కొన్ని కొన్ని ప్రచారాలు నిజమే అనుకునే విధంగా ఉంటాయి అనే విషయం అర్ధమవుతుంది. తాజాగా ఒక వీడియో అమీర్ ఖాన్ కి సంబంధించి విస్తృతంగా వైరల్ అవుతుంది.

అసలు ఆ వీడియో లో ఏమి ఉంది అంటే.. ఢిల్లీలో పేద‌ల‌కు సాయం చేసేందుకు ఓ ట్ర‌క్కు వీధిలో వ‌చ్చి ఆగగా… అందులో ఉన్న‌ కొందరు సిబ్బంది… కిలో గోధుమ పిండి ప్యాకెట్ల‌ను పేద‌ల‌కు ఇస్తూ ఉంటారు. కొందరు ఇది కేవలం పిండికి మాత్రమేనా అని వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. కాని ఆ పిండి ప్యాకెట్ లో మాత్రం అద్భుతం ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు. పేదలు ఎక్కువ మంది ముందుకు వచ్చి వాటిని తీసుకున్నారు.

వాటిని తీసుకుని ఇంటికి వెళ్లి చూడ‌గా అందులో ప‌దిహేను వేల‌ రూపాయ‌లు కనిపించాయి అని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ట్రక్ ని పంపింది బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అనేది అతని అభిమానుల మాట. ఇంత భారీ సహాయం చేస్తే అతను నిజంగా చెప్పకుండా ఉంటాడా…? టిక్ టాక్ వాట్సాప్ యునివర్సిటి విద్యార్ధులు తయారు చేసిన ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అమీర్ మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news