క్యారావాన్‌లో నిర్మాతలే వీపు దువ్వుతున్నారు.. సీనియర్ నటి కామెంట్స్

-

మెగాస్టార్ చిరంజీవి ఏదైనా మాట్లాడితే ఈ మధ్య అది చాలా వైరల్ అవుతోంది. ఇండస్ట్రీ పెద్ద దిక్కు దాసరి నారాయణ చనిపోయాక.. ఆలోటు భర్తీ చేసేందుకు చిరు ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఈ మధ్య ఇండస్ట్రీ వ్యవహారాల గురించి, సినీ పరిశ్రమ పోకడల గురించి అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. ఆ మధ్య మా డైరీ ఆవిష్కరణలో కార్యక్రమంలో మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉంటే చెవిలో చెబుదాం అనే స్లోగన్ ఒకటి ఇచ్చాడు. తాాజాగా ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని క్యారవాన్ పద్దతికి స్వస్తి చెప్పాలని అందరికీ సూచించాడు.

అయితే ఈ క్యారవాన్ పద్దతి, తనకు ఎదురైన అనుభవాల గురించి సీనియర్ నటి కవిత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో తనను దుస్తులు మార్చుకుని రావాలని చెప్పారు.. అప్పుడు  హీరోయిన్ క్యారవ్యాన్‌లోకి వెళ్లి మార్చుకోవాలని అనుకున్నానని తెలిపింది. కానీ ఆ హీరోయిన్ ఒప్పుకోలేదు.. ఇది తన క్యారవ్యాన్.. మీరు లోపలికి ఎలా వెళ్తారని మొహం మీదే చెప్పిందని పేర్కొంది. అప్పుడు ప్రభుదేవా తన క్యారవాన్ వాడుకోండని అన్నారని చెప్పుకొచ్చింది.

చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ ఇలా పెద్ద పెద్ద హీరోలకు ఇలాంటి పద్ధతులు తెలీదని అంది. కానీ ఇప్పుడిప్పుడు వస్తున్న చిన్న చిన్న ఆర్టిస్ట్‌లకే ఈ పొగరు.. అది మంచి పద్ధతి కాదని తెలిపింది. ఒకప్పుడు అందరం ఒకే దగ్గర కూర్చుని తర్వాతి సన్నివేశం ఏంటి అని డిస్కస్ చేసుకునేవాళ్లమని నాటి సంగతులను గుర్తు చేసుకుంది. ఇప్పుడు అలా కాదు ప్రతీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లి వారి క్యారవాన్లలో కూర్చుని స్క్రిప్ట్ రిపీట్ చేస్తూనే ఉండాలని చెప్పుకొచ్చింది. దీని వల్ల పూర్తిగా నష్టపోతుంది నిర్మాతేనని వెల్లడించింది. ఆ విషయం కొంతమందికి నిర్మాతలకి అర్థం కావటం లేదనీ.. అందుకు ఒక కారణమూ ఉందని అసలు విషయం బయట పెట్టింది.

‘నా క్యారవ్యాన్‌లోకి నువ్వు వెళ్లకూడదు అని ఓ హీరోయిన్ నాతో అన్నప్పుడు అక్కడే ఉన్న నిర్మాత ఆమెను తిట్టాల్సిందిపోయి చూస్తూ నిలబడిపోయాడు. నిర్మాతలే వీపులు దువ్వుతున్నారు. అలాంటప్పుడు చిరంజీవిలాంటి వాళ్లు ఎంత మాట్లాడి ఏం లాభమ’ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news