ఆర్మీలో చేరాలనుకునే వారికి అడివి శేష్ మద్దతు..‘మేజర్’ హీరో అఫీషియల్ అనౌన్స్‌మెంట్

-

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘మేజర్’ ఫిల్మ్ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. ఈ పిక్చర్ చూసి జనాలు భావోద్వేగానికి గురవుతున్నారు. థియేటర్లలో మూవీ చూసిన అనంతరం ‘మేజర్ అమర్ రహే’ అని నినాదాలు చేస్తున్నారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర విజయాన్ని మూవీ యూనిట్ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సక్సెస్ మీట్ లో హీరో అడివి శేష్ కీలక ప్రకటన చేశారు.

ఆర్మీలో చేరాలనుకునే యువతకు మద్దతిస్తామని, అయితే, ఎలా మద్దతు ఇస్తామనేది త్వరలో చెప్తానని అడివి శేష్ తెలిపారు. ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని, ముందుగా పది మంది యువతతో ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం ఎంత మందికి చేరవవుతుందో తెలియదని పేర్కొన్నారు. అడివి శేష్ ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. యువతకు మద్దతు తెలపడం మంచి విషయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news