రష్మిక మాయలో అక్కినేని హీరో..!

-

అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో కొద్దిపాటి గ్యాప్ తో హలో సినిమా చేశాడు. అది కూడా నిరాశపరచడంతో మిస్టర్ మజ్ను అంటూ వచ్చాడు. మూడవ సినిమా కూడా అఖిల్ కు సక్సెస్ ఇవ్వలేకపోయింది. లేటెస్ట్ గా అఖిల్ తన 4వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను సెలెక్ట్ చేశారట.

ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రష్మిక వరుస ఛాన్సులు అందుకుంటుంది. ఛలో, గీతా గోవిందం, దేవదాస్ చేసిన 3 సినిమాలతోనే అమ్మడు ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక గీతా గోవిందం తర్వాత మళ్లీ అదే బ్యానర్ లో సినిమా చేస్తుంది. అఖిల్ జోడీగా రష్మిక తప్పకుండా ఈ కాంబినేషన్ క్రేజీగా మారుతుందని చెప్పొచ్చు. కనీసం ఈ సినిమా అయినా అఖిల్ ను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news