ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్ లను డైరెక్ట్ చేసి.. చివరికి యూట్యూబ్ ఛానెల్ యాంకర్ అయ్యాడా..!

-

టాలీవుడ్ స్టార్ హీరోస్ ప్రభాస్, ఎన్.టి.ఆర్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఓ దర్శకుడు ఇప్పుడు అతనికి సినిమా ఛాన్సులు లేక ఓ యూట్యూబ్ ఛానెల్ కు యాంకర్ గా మారాడు. అదికూడా మెగా బ్రదర్ నాగబాబు యూట్యూబ్ ఛానెల్ నా ఛానెల్ నా ఇస్టం లో యాంకర్ గా మారాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే ఇంకెవరు మెహెర్ రమేష్ అని తెలుస్తుంది.

మెగా కుటుంబానికి సన్నితుడైన మెహెర్ రమేష్ బిల్లా, కంత్రి సినిమలతో పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత ఎన్.టి.ఆర్ తో తీసిన శక్తి, వెంకటేష్ షాడో అతన్ని షాడోలో వెళ్లేలా చేశాయి. మెహెర్ రమేష్ సినిమా అంటే వామ్మో అనుకునే పరిస్థితి వచ్చింది. అతన్ని నమ్మి హీరో కాదు నిర్మాతలు బుగ్గిపాలు అయ్యారు. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మెహెర్ రమేష్ దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు.

లేటెస్ట్ గా నాగబాబు యూట్యూబ్ ఛానెల్ లో యాంకర్ గా కనిపించాడు. ఈమధ్య కొన్ని యాడ్స్ ను డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. అయితే అతను డైరక్టర్ గా మరో ప్రయత్నం చేసే ఆలోచన అయితే ఇప్పుడప్పుడే లేదన్నట్టు టాక్.

Read more RELATED
Recommended to you

Latest news