అక్కినేని అభిమానులకు చేదు వార్త ..ఆగిపోయిన షూటింగ్

-

యంగ్ హీరో అక్కినేని అఖిల్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంలో అఖిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జారుతుండగా అఖిల్ గాయపడినట్లు తెలుస్తుంది. అయితే సినిమాకు సంబంధించి ఒక ఫైట్ చిత్రీకరణ నేపథ్యంలోనే ప్రమాదవశాత్తు అఖిల్ గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడి చేతికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అఖిల్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చేతికి తీవ్ర గాయం అవ్వడం తో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ను కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది. అఖిల్ ఆ గాయం నుంచి తిరిగి కోలుకున్న తరువాతే ఈ చిత్రం షూటింగ్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో జీ ఏ 2 పిచ్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు,వాసు వర్మ నిమిస్తుండగా,గోపీ సుందర్ సంగీతం సమకూర్చుతున్నారు. అఖిల్ హలొ చిత్రం తరువాత చాలా గ్యాప్ తీసుకోని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం అయినా అఖిల్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రసుతం ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న చిత్రం ఇప్పుడు అఖిల్ ప్రమాదానికి గురవ్వడం తో నిలిచిపోయినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news