తొలిసారి ఓటు వేసిన అక్షయ్ కుమార్..!

-

56 ఏళ్లలో భారత్లో తొలిసారి ఓటు వేశారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఈ న్యూస్ చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. అంతేకాదు. ఇది నిజామా కాదా అనే అనుమానం కూడా వచ్చింది చాలా మందికి. అవును ఇది అక్షరాలా నిజం. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి ఇండియాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


వాస్తవానికి అక్షయ్ కుమార్ కు 2023 వరకు కెనడా పౌరసత్వం ఉండేది. 2023 ఆగస్టులో ఆయనకు భారతీయ పౌరసత్వం లభించింది. భారతీయ పౌరసత్వం పొందిన తరువాత వచ్చిన తొలి ఎలక్షన్స్ కాబట్టి ఆయన తొలిసారి ఇండియాలో ఓటు వేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్షయ్ కుమార్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే ఓ మై గాడ్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్పలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు అక్షయ్ కుమార్. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఈమధ్యే కంప్లీట్ చేశాడు అక్షయ్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news