అల వైకుంఠపురములో ఈ ఒక్క పాయింట్ ఎవ్వరికీ నచ్చలేదు .. వెరీ బ్యాడ్ !!

-

 

ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అల వైకుంఠపుములో సినిమా అదరగొట్టేసిందనే చెప్పాలి. మరోసారితన మార్కు క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మరోసారి అద్భుతంగా పండించారు. సెంటిమెంట్ కు తన పంచ్ పదాలతో అలరించే త్రివికమ్ మ్యాజిక్ మరోసారి రిపీటైంది. క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రతి క్యారెక్టర్ నూ త్రివిక్రమ్ తనదైన క్యారెక్టరైజేషన్ తో తీర్చిదిద్దారు.

 

అయితే త్రివిక్రమ్ పైన ఎప్పటి నుంచో ఒక విమర్శ ఉంది. తన చిత్రాలలో ఎప్పుడు చాలామంది మంచి నటీనటులను పెట్టుకున్నా కూడా ఎవరికీ సరైన పాత్ర ఇవ్వడు అని అంతా అంటుంటారు. సరిగ్గా ఇప్పుడు వచ్చినా అల వైకుంఠపురం చిత్రంలో కూడా అదే జరిగింది. నవదీప్ మరియు సునీల్ లాంటి సాలిడ్ నటులను పెట్టుకొని వారిని కేవలం రెండు మూడు సీన్లకే పరిమితం చేయడం అనేది చాలా మంది ప్రేక్షకులకు నచ్చలేదు.

అసలు వారిద్దరు సినిమాలో లేకపోయినా ఒక రవ్వంత నష్టం కూడా ఉండదు. వారికి.. కథ కి ఎటువంటి సంబంధం లేదు కనీసం వారితో సంబంధం ఉన్న నటులకైనా కథలో ఏ క్యారెక్టర్ లేదు. అలాంటప్పుడు అసలు వారిని ఎందుకు తీసుకున్నారని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా త్రివిక్రమ్ అవసరమైనంత వరకే నటీనటులను పరిమితం చేస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news