అభిమానికి స‌ర్‌‌ప్రైజ్ షాకిచ్చిన బ‌న్నీ!

-

వెండితెరపై మెస్మ‌రైజ్ చేసే తార‌ల్ని అభిమానులు త‌మ పాలిట ప్ర‌త్య‌క్ష దైవాలుగా భావిస్తుంటారు. వారి కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతుంటారు. అచ్చం ఇలాంటి ప‌నే అల్లు అర్జున్‌ని పిచ్చిగా అభిమానించే ఓ అభిమాని చేశాడు. త‌న అభిమాన హీరో కోసం ఏకంగా 250 కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసి హైద‌రాబాద్ చేకున్నాడు. ఈ విష‌యం తెల‌సి బ‌న్నీ షాక్ అయ్యార‌ట‌.

వివ‌రాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా మాచ‌ర్ల మండ‌లం కంభంపాఉఉ చెందిన పి. నాగేశ్వ‌ర‌రావు అనే అభిమాని అల్లు అర్జున్ ని చూడాల‌ని, ఆయ‌న త‌న‌ని గుర్తించాల‌ని ఓ వినూత్న‌మైన ఆలోచ‌న‌తో మాచ‌ర్ల నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు బ‌న్నీ కోసం పాద‌యాత్ర చేశాడు. ఈ విష‌యం బ‌న్నీ చెవిన ప‌డింది. వెంట‌నే నాగేశ్వ‌ర‌రావుని త‌న ఆఫీసుకి పిలిపించుకుని స‌ర్‌ప్రైజ్ షాకిచ్చాడు. దీంతో నాగేశ్వ‌ర‌రావు ఆనందంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌యిపోతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news