పారితోషకం విషయంలో అలా చేయకపోతే నిద్ర రాదంటున్న అల్లు అరవింద్..!

-

తాజాగా అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ , సురేష్ బాబు తో పాటు అగ్రదర్శకులైన కే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ఐదవ ఎపిసోడ్ కి హాజరవడం జరిగింది. ముఖ్యంగా హోస్ట్ బాలయ్య తో పాటూ ఈ ఐదు మంది సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను చర్చిస్తూనే మరొక పక్క పారితోషకం విషయం కూడా ప్రస్తావించడం జరిగింది. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను విడుదల చేయగా ఆద్యంతం ప్రేక్షకులను ఎపిసోడ్ కోసం ఎదురుచూసేలా చేసింది. ఈ క్రమంలోని శుక్రవారం రాత్రి ఆహా టీం వారు ఎపిసోడ్ ను ప్రసారం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎన్నో విషయాలను అల్లు అరవింద్ , సురేష్ బాబు పంచుకోవడం గమనార్హం.

అసలు విషయంలోకి వెళితే.. బాలయ్య బాబు మాట్లాడుతూ.. మీ ప్రొడక్షన్ హౌస్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తే పారితోషకం ఇస్తారా ? అని అల్లు అరవింద్ ను అడిగారు. అయితే ఈ విషయంపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చిరంజీవి, అల్లు అర్జున్, శిరీష్ మా ఫ్యామిలీలో ఏ హీరో అయినా సరే పని చేశారు అంటే పారితోషకం విషయంలో కచ్చితంగా ఉంటాము. ఏ ఒక్కరికైనా సరే రెమ్యునరేషన్ మొత్తం ఇచ్చాకే నేను సినిమా రిలీజ్ చేస్తాను. వాళ్లకి రెమ్యునరేషన్.. సినిమా రిలీజ్ కి ముందు రోజు అయినా సరే ఇచ్చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే నిద్ర కూడా రాదు అంటూ తెలిపారు అల్లు అరవింద్.

అయితే ఇటీవల మొన్నా మధ్య పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్ ని నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో మీ నాన్న దగ్గర రెమ్యునరేషన్ తీసుకుంటారా అని అడిగితే..” తీసుకుంటాను.. మా నాన్నకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే .. నాకు ఇవ్వరు కదా!” అని అన్నాడు.. అని అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నారు. మొత్తానికైతే సొంత వాళ్లకి కూడా పారితోషకం ఇస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నారు అల్లు అరవింద్.

Read more RELATED
Recommended to you

Latest news