బన్నీ హీరోయిన్​తో శిరీష్ డేటింగ్!.. క్లారిటీ ఇచ్చిన హీరో

-

‘ఊర్వశివో రాక్షసివో’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు నటుడు అల్లు శిరీష్‌. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా ప్రచారచిత్రాలు యువతను ఆకట్టుకున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు.. ఈ జంట ప్రేమలో ఉందని మాట్లాడుకుంటున్నారు. దీనిపై తాజాగా శిరీష్‌ స్పందించాడు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ… ‘‘నటీనటుల జీవితాల్లో ఇలాంటి వదంతులు సర్వసాధారణం. కోస్టార్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం సహజం. గతంలోనూ నా గురించి ఇలాంటి వార్తలే వచ్చాయి. నిజం చెప్పాలంటే మా మధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కొన్ని నెలలపాటు కలిసి పనిచేశాం కాబట్టి మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదీ కాక.. తను చాలా సైలెంట్‌. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి.

సంగీతం, పుస్తకాలు, సినిమాలు.. ఇలా ఎన్నో విషయాల్లో మా అభిరుచులు కలిశాయి. దానివల్ల మేమిద్దరం ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. వర్క్‌ విషయంలో తను ప్రొఫెషనల్‌గా ఉంటుంది. అందువల్లే రొమాంటిక్‌ సీన్స్‌ చేసేటప్పుడు ఇబ్బందిపడలేదు. ‘‘ఆన్‌లైన్‌లో కామెంట్లు చూసినప్పుడే నెగెటివిటీని ఎక్కువగా ఫీలవుతాం. అందుకే రెండేళ్ల నుంచి సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్నా. నేనే కాదు మిగిలిన నటీనటులు కూడా ఆన్‌లైన్‌కు వీలైనంత వరకూ దూరంగా ఉంటున్నారు’’ అని శిరీష్‌ వివరించారు.

రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అనుఇమ్మాన్యుయేల్​తో అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తీశాడు. అయితే ఇది బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేదు. మరి తమ్ముడు శిరిష్ కైనా ఈ సారి ఈ అమ్మడు కలిసొస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news